ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నటి ప్రియమణి పాల్గొని మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో మధురైలోని కోయిల్పట్టిలో ప్రియమణి మొక్కలు నాటారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, కెమెరామెన్ శ్యాం కే నాయుడు, నటుడు రామరాజు, మూవీ యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ.. గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు దయచేసి అందరూ మొక్కలు నాటాల్సిందిగా ఆమె కోరారు. పెండ్లి రోజు, పుట్టినరోజులకి బహుమతులు కాకుండా ఇలా మొక్కలు నాటించాలంది. మొక్కలు నాటడమే కాకుండా వారిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని పేర్కొన్నారు.
గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న నటి ప్రియమణి