కరీంనగర్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ....పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. కొన్ని కోట్ల మొక్కలు నాటే విధంగా ఎంతో మందిని ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కృషి అభినందనీయమని అన్నారు.
మనం నాటే మొక్కలు మనకే కాక భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి ఈటెల తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమంతో ఎంపీ సంతోష్ కుమార్ భావితరాలకు మార్గదర్శకులుగా మారారు. ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటడం కాదు. అవి పెరిగి పెద్ద అయ్యేలా చూడాలని సూచించారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో సేవ్ ట్రీస్ ఫౌండర్ విక్రాంత్, తదితరులు పాల్గొన్నారు.