క‌రోనా గుణ‌పాఠం నేర్పింది: ప‌్ర‌ధాని

‌తి ఒక్క‌రూ ఆత్మ‌స్థైర్యంతో ఉండ‌గ‌లిగేలా క‌రోనా గొప్ప గుణ‌పాఠం నేర్పింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు కృషిచేస్తున్న సర్పంచులంద‌రికీ ప్ర‌ధాని ధన్యవాదాలు తెలిపారు. మెరుగైన సేవలతో పురస్కారాలు పొందిన సర్పంచులను అభినందించారు. 


ఏటా మెరుగైన పనితీరు కనబర్చిన గ్రామపంచాయతీలకు పురస్కారాలు అందిస్తామని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు సరిపడా ఆహారధాన్యాలు అందుబాటులో ఉంచాల‌ని సర్పంచుల‌కు సూచించారు. విద్యుత్‌, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఎంతో కృషి చేస్తోందని,  పంచాయతీ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.